జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ లోని అన్ని బ్యాంకుల ఉద్యోగులందరిని ఒక తాటిపైకి తీసుకొని వచ్చి మంచి సాంస్కృతిక, వినోదాత్మక కార్యక్రమాలతో అందరిని అలరించి ఆనందింపజేయాలనే ఉద్దేశ్యంతో ఏర్పరచిన సంస్థ “భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్”
ఇందుకు సూత్రధారులైన అధ్యక్షులు శ్రీ టి ఎస్ వి ప్రసాద్ గారు విశ్రాంత బ్యాంక్ అధికారి. ఆయన ఆలోచన మరికొంతమందితో పంచుకోగా నాలుగు సంవత్సరాల క్రితం ఆవిర్భవించినదే “భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్” 21 మంది కార్యవర్గ సభ్యులు గల సంస్థలో ఇంతవరకు 3100 పైచిలుకు సభ్యులుగా వున్నారు. వారిలో 500 పైచిలుకు జీవితకాల సభ్యులుగా వున్నారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు అందుకుంది. సంగీత విభావరులు, విహారయాత్రలు, వార్షికోత్సవాలు,సభ్యుల సమావేశాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి సమాయత్తం అవుతోంది. నానాటికీ సభ్యుల సంఖ్య పెంచుతూ మహోన్నత సంస్థ గా తీర్చిదిద్దాలని అధ్యక్షులు శ్రీ ప్రసాద్ గారు మరియు కార్యవర్గం దృడ సంకల్పంతో వున్నారు.