భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ ఆవిర్భవించి నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అధ్యక్షులు శ్రీ టి ఎస్ వి ప్రసాద్ గారి సూచనలు, సలహాల మేరకు నిర్వహించు సేవా కార్యక్రమాలలో భాగంగా ఈనాడు“భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్” అధ్వర్యంలో జరిగిన సేవాకార్యక్రమం “బి బి జీ” నిర్వహించిన సేవా కార్యక్రమాలలో ఒక మంచి కార్యక్రమం అని చెప్పవచ్ఛు. ఇబ్రహీంపట్నం లో గల “మాతా పితరుల సేవా సదనం” ఒక వృద్ధాశ్రమం. ఏ దిక్కూలేని పేద వృద్ధులను చేరదీసి వారికి దిక్కులేనివారమనే ఆలోచన, దిగులు లేకుండా చేసి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి ఆదరిస్తున్న సేవా సంస్థ,నిర్వాహకులు భాస్కర రావు గారు,రామచంద్రా రెడ్డి గారు. వారి కోరిక మేరకు వారి అవసరార్థం బి బి జీ తరపున ఆహార పదార్థాలైన కిరాణా సరకులు వితరణ చేయడం జరిగింది. బి బి జీ కార్యవర్గ సభ్యుడు శ్రీ తులసీ కృష్ణ మూర్తి తండ్రిగారి జ్ఞాపకార్థం కృష్ణ మూర్తి గారి దాతృత్వంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ సభ్యులు కార్యవర్గ సభ్యులు శ్రీ యుతులు తులసీ కృష్ణ మూర్తి గారు శ్రీమతి తులసీ పద్మజ గారు, వెంకోబ రావుగారు శ్రీమతి లీలావతి గారు,జి విద్యాసాగర్ గారు శ్రీమతి రజని గారు, అమర విద్యాసాగర్ గారు శ్రీమతి అరుణ గారు, జే పి సుధాకర్ గారు శ్రీమతి అనూరాధ గారు, శ్రీ సమయమంతుల శ్రీనివాస్ గారు మొ|| వారు హాజరై ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. అక్కడ వున్న వృద్దులకు మధ్యాహ్నం భోజనం వడ్డించి వారిని ఆనందపరిచారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ నుండి ఆశిస్తూ వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
తులసి కృష్ణ మూర్తి
జాయింట్ సెక్రటరీ
&
కో ఆర్డినేటర్ ఫర్ ద ఈవెంట్